కాలేజీ మీద కూలిన విమానం.. 20 మంది విద్యార్థులు మృతి

Thursday, June 12, 2025 04:27 PM News
కాలేజీ మీద కూలిన విమానం.. 20 మంది విద్యార్థులు మృతి

అహ్మదాబాద్‌లో మేఘానిలో కూలిన ఎయిర్‌ఇండియా విమానం బీజే మెడికల్‌ కాలేజీపై కూలింది. ఆ ఘటనలో 20 మందికి పైగా మెడికోలు మృతి చెందారు. మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్‌ అయిన విమానం టేకాఫ్‌ అయిన వెంటనే కూలింది. విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో 169 మంది భారతీయులు, 53మంది బ్రిటన్ వాసులు, ఒక కెనడియన్‌, ఏడుగురు పోర్చుగల్ వాసులు, విమానంలో ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నారు.

ప్రమాదస్థలిలో బీఎస్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 90 మంది చొప్పున మూడు బృందాలుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మూసివేశారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. ఎయిరిండియా హెల్ప్‌లైన్‌ నెంబర్ 1800 5691 444 ను విమాన ప్రమాద విచారణ కోసం ప్రకటించింది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: