ముదిగుబ్బ వాసికి డీఎస్సీలో మూడు ఉద్యోగాలు
Saturday, August 23, 2025 09:40 PM News
సత్యసాయి జిల్లాలో ఓ వ్యక్తి డీఎస్సీలో ఏకంగా మూడు ఉద్యోగాలు సాధించాడు. ముదిగుబ్బకు చెందిన ఉదయ్ కుమార్ పీజీటీ సోషల్ లో 2వ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ లో 7వ ర్యాంకు, టీజీటీ సోషల్ స్టడీస్ లో 10వ ర్యాంకు సాధించి మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.
2012 నుంచి పరీక్షలు రాస్తూ తృటిలో ఉద్యోగం కోల్పోతున్నా నిరాశ చెందకుండా పట్టువదలని విక్రమార్కుడిలా విజయం సాధించాడు. తల్లి, భార్య ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించినట్లు ఉదయ్ చెప్పాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



