తమిళనాడులో 1,381 కేజీల టీటీడీకి చెందిన బంగారం పట్టివేత..!

Thursday, April 18, 2019 12:00 PM News
తమిళనాడులో 1,381 కేజీల టీటీడీకి చెందిన బంగారం పట్టివేత..!

తమిళనాడు రాష్ట్రంలో భారీ స్థాయిలో బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంభట్టు దగ్గర ఎలక్షన్ విధులలో తనిఖీలు చేపట్టిన పోలీసులు 1381 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకొని బంగారాన్ని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది అంతా టీటీడీకి చెందిన బంగారంగా అనుమానిస్తున్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా అధికారులు వాహనాలు తనిఖీ చేయగా ఓ వ్యాన్లో భారీగా బంగారం పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న బంగారం టీటీడీకి సంబంధించింది అని నిందితులు చెబుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తిరుపతికి ఈ బంగారం తరలిస్తున్నట్లు తెలిపారు.

పీఎన్‌బీలో టీటీడీ బంగారం ఉందని, దానికి మెచ్యూరిటీ ముగియడంతో బంగారంను తీసుకెళ్లాలని టీటీడీకి పీఎన్‌బీ అధికారులు సూచించారని నిందితులు తెలిపారు. బ్యాంకు అధికారుల సూచనతో బంగారం తీసుకుని టీటీడీ అధికారులకు అప్పగించేందుకు తిరుపతి వెళ్తున్నామన్నారు. బంగారం టీటీడీది అని చెబుతున్నా వారి దగ్గర ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. బంగారాన్ని బ్యాంకు నుంచి తెస్తున్నట్టు డాక్యుమెంట్స్ లేవు, దీంతో అనుమానం వచ్చిన పోలీసులు గోల్డ్ని సీజ్ చేసి భద్రపరిచారు. దీనిపై ఎన్నికల అధికారులు టీటీడీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ గోల్డ్ టీటీడీదా కాదా అనే నిజాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. 

For All Tech Queries Please Click Here..!