ఏసీ వాడుతున్నారా.. ఇకపై కొత్త రూల్స్ రాబోతున్నాయి..
Wednesday, June 11, 2025 09:35 AM Lifestyle

దేశంలో ఎయిర్ కండీషనర్ల (ఏసీ) వినియోగానికి సంబంధించిన కొత్త నిబంధనలు రాబోతున్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా ఏసీల టెంపరేచర్ కు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించేందుకు సిద్ధమవుతోంది.
"ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ ఉండాలని నిర్ణయించాం. త్వరలోనే దీన్ని అమలు చేయనున్నాం. ఏ మేర సత్ఫలితాలను ఇస్తుందో చూస్తాం"అని కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: