యాత్ర సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్
మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’, యాత్ర సినిమా ప్రొడ్యూసర్ విజయ్ చిల్లా మాట్లాడుతూ ప్రేక్షకులందరికీ యాత్ర నచ్చుతుంది అని చెప్పారు, మా కథని నమ్మి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసిన మమ్ముట్టిగారికి ధన్యవాదాలు తెలిపారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ఐదు వైవిధ్యమైన పాటలు అద్భుతంగా రాశారు. ‘యాత్ర’ సినిమా వైఎస్గారి అభిమానులకు ఎలాగూ నచ్చుతుంది. కానీ, ఈ సినిమా ఆయన అభిమానులకి మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని నిర్మాత విజయ్ చిల్లా అన్నారు.
మమ్ముట్టి లీడ్ రోల్లో నటించారు, మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు, శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శశి దేవిరెడ్డి, విజయ్ చిల్లా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకి వస్తుంది.
వైఎస్ రాజశేఖర రెడ్డిగారి అభిమానులే సెలబ్రిటీలుగా హాజరై ‘యాత్ర’ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేశారు అని . ఈ సందర్భంగా వారు వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందారో తమ మాటల్లో పంచుకున్నారు అని విజయ్ చిల్లా తెలిపారు, వైస్సార్ తలపెట్టిన ప్రతి పథకం మూవీ లో పెట్టాము అతెలిపారు.
ఈ సభలో పాలుపంచుకున్న కొంత మంది అభిమానుల కామెంట్స్ మీ కోసం
- ‘వైఎస్గారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మేము చదువుకున్నాం. నిరుపేదలమైన మేము ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివాం’ అని తూర్పుగోదావరి జిల్లా తాల్రేవు మండలం పి.మల్లవరం గ్రామానికి చెందిన స్వర్ణలత, సువర్ణ కుమారి అన్నారు.
- ‘వైఎస్గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు నా కుటుంబానికి వర్తించాయని గర్వంగా చెబుతున్నా’ అని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన నక్కా లక్ష్మీనారాయణ అన్నారు.
- ‘వైఎస్గారి పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నా. నాకు వికలాంగుల పెన్షన్తో పాటు ఇల్లు మంజూరు చేశారాయన. రాజన్న చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేం. రాజన్న కుమారుడు జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలి’’ అని ఆనపాటి వెంకటయ్య చెప్పారు.
- ‘చాలా దూరం నుంచి ఒక్కదానివే ఎలా వచ్చావని ఎంతో మంది నన్ను అడిగారు. వైఎస్గారు ఇచ్చిన ధైర్యం చాలదా మనకి ఒంటరిగా రావడానికి? ఫీజు రీయింబర్స్మెంట్తో చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యా’ అని తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన వి.నిఖిల సంతోషం పంచుకున్నారు.
- ‘మా అమ్మకి గుండెకి రంధ్రం ఉండేది. అమ్మ ఆపరేషన్ కోసమని చదువు మానేశా. పనిలో చేరా. ఆపరేషన్ చేయించే స్థోమత లేదు. మా అమ్మ గోడు ఏ దేవుడూ వినలేదు. వైఎస్ అనే దేవుడు విన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకంతో మా అమ్మకి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్ చేయించా’ అని నిజామాబాద్ జిల్లా దేవపల్లికి చెందిన కె. రవికుమార్ చెప్పారు.