ఎన్నికల ప్రచారానికి బాలయ్య ఆహ్వానం, షాక్ ఇచ్చిన ఎన్టీఆర్..!

Saturday, March 30, 2019 05:33 PM Entertainment
ఎన్నికల ప్రచారానికి బాలయ్య ఆహ్వానం, షాక్ ఇచ్చిన ఎన్టీఆర్..!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నామినేషన్ ఉపసంహరణకు గడువు కూడా ముగిసింది. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ప్రచారంతో ఎవరి పందా వాళ్లు వాడుతున్నారు .ప్రతిపక్షంనేత వైఎస్ జగన్ ప్రచారజోరు పెంచారు. తన ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎండగడుతూ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు తన కుమారుడు జగన్‌కు తోడుగా వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మీ ప్రచారంలోకి దిగనున్నారు.అలాగే జనసేనకు సపోర్ట్ గా కొందరు సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి కూడా కొందరు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.

అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు నందమూరి బాలకృష్ణ. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బాలయ్యకు మద్దతుగా ఆయన సతీమణి వసుంధర కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. హిందూపూర్ టీడీపీ నాయకులలో ఎన్టీఆర్ ను ప్రచారానికి పిలవమని బాలయ్యతో చెప్పారంట. దాంతో ప్రచారానికి రమ్మని బాలయ్య ఎన్టీఆర్ కు ఫోన్ చేశాడంట. దానికి ఎన్టీఆర్ ఈవిధంగా జవాబిచ్చారు.

తాతగారు పార్టీ పెట్టినప్పటినుంచి నాకు తెలుగుదేశం పార్టీ అంటే ఎనలేని ప్రేమ ఉంది. అందుకే నేను ఎన్నోసార్లు పార్టీ తరుపున ప్రచారం చేశాను. కానీ నాన్నగారు చనిపోకముందు నాకు నాన్నకు ఒక సంభాషణ జరిగింది. నువ్వు సినిమాలలో బాగా రాణిస్తున్నావు. ఇంకా బాగా రాణించాలి. ఇప్పుడే నువ్వు వేరే విషయానికి డైవర్ట్ అవ్వొద్దు అని నాన్నగారు చెప్పారు. అందుకే కొన్నేళ్ల పాటు రాజకీయాలకు పార్టీలకు దూరంగా ఉండాలని అనుకున్నా. నేను రాలేను బాబాయ్ అని బాలయ్యతో ఎన్టీఆర్ అన్నాడంట. అయితే ఎన్టీఆర్ రాకపోడానికి ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటున్నారు. 

For All Tech Queries Please Click Here..!