హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం

Friday, January 25, 2019 09:36 AM Entertainment
హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం

గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ డీజే చిత్రం తర్వాత మరో సినిమా ప్రారంభించలేదు. కొందరు హీరోలతో సినిమా చేసేందుకు ప్రయత్నించినా అది కుదర్లేదు. ఆ మధ్యన హరీష్ ఓ మల్టీస్టారర్ చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం హరీష్ శంకర్ తమిళ సూపెర్ హిట్ మూవీ జిగర్తాండని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

తమిళంలో సిద్దార్థ్ హీరోగా నటించాడు. ఈ చిత్ర విజయానికి విలన్ పాత్ర కూడా ప్రధాన కారణం. ప్రముఖ నటుడు బాబీ సింహ పోషించిన నెగిటివ్ రోల్ కు ప్రశంసలు దక్కాయి. తెలుగులో ఆ పాత్రలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నాడు. విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్న వరుణ్ ప్రస్తుతం ఎఫ్2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. జనవరి 27న ఈ చిత్ర ప్రారంభోత్సవం జరుగనుంది. ప్రారంభోత్సవానికి స్టార్ సెలెబ్రిటీలు హాజరుకానున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్ర కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చాడట. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుందట. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
 

For All Tech Queries Please Click Here..!