మహిళ ముందు ప్యాంట్ జిప్ తీసి చూపిస్తూ..

మహిళను చూస్తూ ఆమె ముందే ఓ కుర్రాడు తన ప్యాంటు జిప్ తీసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని ప్రశ్నించిన మహిళ భర్తపై, స్థానికులపై దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని క్వీన్స్ రోడ్లోని రాజీవ్ గాంధీ కాలనీలో చోటు చేసుకుంది.
ఏప్రిల్ 13న సోమవారం రాత్రి 10:30 గంటలకు ఒక మహిళ భోజనం ముగించి రెండవ అంతస్తులో పడుకోబోతుండగా, ఎదురుగా ఉన్న ఇంటి నుండి కార్తీక్ అనే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. ప్యాంటు జిప్ తీసి, తన ప్రైవేట్ పార్ట్స్ను చూపిస్తూ ఆమెను ఆ పని కోసం ప్రేరేపిస్తూ వికృతంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అయినా కూడా ఆ కుర్రాడు బెదరకుండా ఆమెను బలవంతం చేయబోయాడు. ఇది గమనించిన చుట్టపక్కల వాళ్లు అతడిని నిలదీశారు. దీంతో వారిపై ఆ యువకుడు దాడికి తెబడ్డాడు. ఆపడానికి వచ్చిన తన తల్లిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసియులో చికిత్స పొందుతున్నారు. కార్తీక్ తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనకు సంబంధించి శివాజీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు గతంలో చాలా మంది మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడని స్థానికులు చెబుతున్నారు.