ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా పేలిన ఫోన్.. యువకుడు మృతి
Sunday, June 8, 2025 12:21 PM Crime

మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని రింగ్ బస్తీలో విషాదం చోటుచేసుకుంది. సాయి (27) అనే యువకుడు ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒక్కసారిగా పేలింది. దీంతో తీవ్రగాయాలై అక్కడే పడిపోయాడు. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో అతడు ఉన్న రూమ్ మొత్తం మంటలు వ్యాపించగా శరీరం కాలిపోయి మృతిచెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: