అక్కతో రాఖీ కట్టించుకుని వస్తూ..
Saturday, August 9, 2025 08:18 PM Crime
అక్కతో రాఖీ కట్టించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జగ్గారావు ఫారం వద్ద చోటు చేసుకుంది. రక్షా బంధన్ నేపథ్యంలో బాసరకు చెందిన సాయిబాబు (19) నిజామాబాద్ లోని అక్క వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకున్నాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై స్వస్థలానికి బయల్దేరాడు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో కంటైనర్ ను ఢీకొని అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
