కట్టుకున్న భర్తను ఇలా చేసిందేంటి...
Friday, August 1, 2025 10:00 AM Crime
ఈ మధ్య కాలంలో భార్యలు తమ భర్తలను హత్య చేస్తున్న ఘటనలు దేశంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఏపిలో అలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న భర్తపై భార్య సలసల కాగుతున్న వేడినీళ్లు పోసింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధి నేరెళ్లవలసలో ఆ దారుణం జరిగింది.
నందిక కృష్ణ, గౌతమి ఆరేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. తరచూ తగాదాలు జరగడంతో తన భర్తపై వేడినీళ్లు పోసేసింది. ప్రస్తుతం బాదితుడు కృష్ణకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



