Breaking: నంద్యాల జిల్లాలో రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి
Friday, August 15, 2025 07:01 AM Crime
నంద్యాల జిల్లాలో రెండు బస్సులు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఆళ్లగడ్డ వద్ద ఆల్ఫా ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ముందు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఇద్దరు, జగన్ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఒకరు మృతిచెందారు. సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



