దారుణం: మూఢనమ్మకానికి ఆరు నెలల గర్భిణీ బలి
Wednesday, June 4, 2025 09:00 AM Crime

అదిలాబాద్ జిల్లాలో భర్త మూఢనమ్మకానికి ఆరు నెలల గర్భిణి బలైంది. బంగారుగూడకు చెందిన యువతికి సేపుర్వార్ ప్రశాంత్ తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి. నూతన ఇంటి పనులు చేపట్టడం, అదే సమయంలో భార్య గర్భవతిగా ఉండకూడదన్న మూఢనమ్మకంతో భర్త బలవంతంగా ఆమెకు గర్భస్రావం మాత్రలు వేశాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: