పరిచయం.. ప్రేమ.. పెళ్ళి.. అంతలోనే..
Wednesday, July 2, 2025 02:00 PM Crime
పాశమైలారం ఘటనలో ఏపీకి చెందిన నవ దంపతులు మరణించారు. కడప జిల్లా పెనికలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్ అదే కంపెనీలో పని చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన శ్రీరమ్య ప్రేమించుకున్నారు. 2 నెలల కిందటే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు.
సంతోషంగా కాపురం సాగుతోంది. ఆషాఢ మాసం ముగిశాక అందరి సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పాశమైలారంలోని కంపెనీలో పని చేస్తున్న వీరు నిన్న విధులకు వెళ్లారు. ఆ సమయంలోనే పేలుడు సంభవించి దంపతులిద్దరూ దుర్మరణం చెందారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



