భార్య ఆఫీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు...

Wednesday, January 30, 2019 11:05 AM Crime
భార్య ఆఫీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు...

అనుమానం పెనుభూతమై ఎలాగైనా భార్యను అంతమొందించాలనే భర్త కృూరత్వం బయటపడింది. సభ్య సమాజంలో ఉన్నాని తెలుసు... చంపడం తప్పని తెలుసు... అలా చేస్తే కటకటాలపాలవుతాడనే విషయమూ తెలుసు. కానీ, వీటన్నింటికంటే భార్యను చంపాలనే బలమైన ఉన్మాదంతో అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ ఉదంతం మహారాష్ట్రలోని థానే జిల్లాలో భయందర్‌లో చోటు చేసుకుంది.

వీణ బోహిర్ మరియు కుమార్ బోహిర్ దంపతులు గత కొంతకాలంగా భయాందర్‌లో నివాసముంటున్నారు. వీణ బోహిర్ అదే ప్రాంతంలోని ఓ స్థానిక ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అదే ఆఫీసులో పనిచేస్తున్న తోటి ఉద్యోగితో వీణ అక్రమ సంబంధం కలిగి ఉందని కుమార్ అనుమానం పెంచుకున్నాడు.

ఈ విషయమై భార్య భర్తలు ఎప్పుడూ గొడవ పడుతుండేవారు. ఎప్పటిలాగే వీణ మంగళవారం తను పనిచేసే ఆఫీసుకు వెళ్లింది. భర్త కుమార్ వీణ ఆఫీసుకెళ్లి ఘర్షణ పడ్డాడు. ఆవేశంలో వెంట తెచ్చుకున్న కత్తితో అందరి ముందే వీణను దారుణంగా పొడిచి చంపేశాడు. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతిడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!