నీట మునిగి 8 మంది మృతి
Tuesday, June 10, 2025 08:51 PM Crime

రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే. మునిగిపోయేవారిని కాపాడేందుకు స్థానికులు యత్నించారు. కానీ అప్పటికే 8 మంది నీటిలో ఊపిరాడక మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: