తెలంగాణలో కాంగ్రెస్ నేత హత్య
Monday, July 14, 2025 05:00 PM Crime
నాగర్ కర్నూల్ కల్వకోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కర్నాటి దామోదర్ కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు సింగోటం రిజర్వాయర్లో ఆయన మృతదేహం లభ్యమైంది.
అయితే దామోదర్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న మహిళ కొడుకు, భర్త అతనిని దారుణంగా హత్య చేసి శవాన్ని కెనాల్ లో పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



