ఒక్క క్షణం ప్రాణం తీసింది
Sunday, March 16, 2025 10:52 PM Crime
వయసుకు వచ్చిన 18 ఏళ్ళ యువతి కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లో నీటి ట్యాంక్ నింపాలని మోటార్ స్విచ్ ఆన్చేస్తుండగా నిసర్గ (18) అనే యువతి కరెంటు షాక్ కొట్టి అక్కడికక్కడే మరణించింది.
ఈ దుర్ఘటన శుక్రవారం రాత్రి హొళెహొన్నూరు సమీపంలోని ఎమ్మెహట్టి గ్రామంలో జరిగింది. యువతి హొళెహొన్నూరులోని ప్రభుత్వ కాలేజీలో పీయూసీ (ఇంటర్) చదువుతోంది. అప్పటి వరకూ కళ్లముందున్న కూతురు క్షణాల్లో విగతజీవి కావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



