బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు ముంచుకొస్తున్న ముప్పు

Weather Published On : Friday, May 30, 2025 07:32 AM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించగా, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. అల్పపీడనం ఉత్తరం వైపు కదులుతుందని, రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, భారీ వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది . గురువారం (నేడు) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదల అవకాశం ఉంది. గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదీ తీరాలు, సరస్సులు, చెరువులు, కాలువల్లో కొట్టుకుపోయే కేసులను తగ్గించడానికి, ప్రమాదాన్ని కలిగించే నీటి వనరులు తక్షణం గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసారు.. ఈ హెచ్చరిక బోర్డుల్లో భద్రతా సూచనలు, సహయం కోసం అత్యవసర నెంబర్ల సమాచారం ఉంటుంది.

మరో వైపు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాటి ప్రభావంతో 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...