అలెర్ట్: రికార్డ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
సోమవారం కోస్తాంధ్రలో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 41- 42°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బాపట్ల, నంద్యాల, కడప,అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.