కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన జియో.
AGR భారం కారణంగా టెలికాం పరిశ్రమ ఇప్పుడు గణనీయమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. చాలా కాలం నుండి ఫ్లోర్ యొక్క ధరలను నిర్ణయించడానికి ట్రాయ్ యోచిస్తోంది. ఇటీవల రిలయన్స్ జియో ట్రాయ్ ను ఉద్దేశించి ఒక ప్రకటను విడుదల చేసింది. ప్రకటనలోని సారాంశం ప్రకారం ధరల పెరుగుదల క్రమంగా జరగాలని మరియు 1GBకి ధరను రూ.15 గా నిర్ణయించాలని సూచించారు.అలాగే రాబోయే ఆరు నుండి తొమ్మిది నెలల వ్యవధి తరువాత 1GB యొక్క ధరను రూ.20కు పెంచాలని సూచించారు.