UPI వాడే వారికి గుడ్ న్యూస్
ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యాప్ ల ద్వారా యూపీఐ సేవలను వినియోగించే వారికి గుడ్ న్యూస్. ఇప్పటి వరకూ ఎవరికైనా పేమెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది.
ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఇకపై ప్రాసెసింగ్ సమయాన్ని దాదాపు 50 శాతం మేర తగ్గించినట్లు నేషనల్ పెమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ జూన్ 16 నుంచి ఇది అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీంతో యూపీఐ సేవలు మరింత సులభతరం కానున్నాయి.