నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్

Sports Published On : Tuesday, June 17, 2025 09:00 AM

2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతగా దక్షిణాఫ్రికా నిలిచింది. అయితే WTC 2025-27 ఎడిషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ఎడిషన్ లో మొత్తం 71 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్లు ఆడనుంది. కాగా, ఈనెల 20న ఇంగ్లండ్ తో భారత్ తన తొలి మ్యాచ్లో తలపడనుంది.