కొత్త పద్ధతిలో ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచులు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో జరగనున్న మహిళల 50 ఓవర్ల ప్రపంచ కప్ హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నమెంట్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్టును భారత్కు పంపేందుకు నిరాకరించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ టీమిండియాను పాకిస్థాన్కు పంపని కారణంగానే,పాకిస్థాన్ ఈ వైఖరి తీసుకున్నట్లు తెలుస్తోంది.