విశాఖలో టీమిండియా మ్యాచ్
2026 జనవరి 21 నుంచి 31 వరకు ఇండియా న్యూజిలాండ్ తో 5 టీ 20 మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగో మ్యాచ్ వైజాగ్ వేదికగా జరగనున్నట్లు సమాచారం.
జనవరి 28వ తేదీన విశాఖపట్నంలోని అంతర్జాతీయ స్టేడియంలో నాలుగో టీ20 మ్యాచ్ జరగనుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా టికెట్లు బుక్ చేసుకోవాలని నెట్టింట్లో వీడియోలు పోస్టులు చేస్తున్నారు.