సచిన్ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును యువ బ్యాటర్ సాయి సుదర్శన్ బద్దలు కొట్టాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన భారతీయ ఆటగాడిగా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ నిలిచాడు. ఇవాళ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అద్భుత ఫామ్లో కనిపించిన సుదర్శన్, కేవలం 23 బంతుల్లోనే 9 ఫోర్లతో 48 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.