మళ్లీ నిరాశపరిచిన పీవీ సింధు
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో మొదటి రౌండ్లో మలేషియా మాస్టర్స్ 2025 టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆక్సియాటా ఎరీనాలో జరిగిన మ్యాచ్లో వియత్నాంకు చెందిన తూయ్ లిన్ చేతిలో 21-11, 14-21, 21-15 తేడాతో ఓడిపోయింది. ఇలా మొదటి రౌండ్లోనే సింధు నిష్క్రమించడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి.