IPL 2025: చరిత్ర సృష్టించిన కోహ్లి
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ తో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లి తన తొలి బౌండరీ సాధించిన వెంటనే, ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధావన్ను అధిగమించాడు. టోర్నీలో 770 ఫోర్లు బాదాడు. ధావన్ 221 ఇన్నింగ్స్ లో ఈ ఘనతను సాధించగా, కోహ్లి తన 258వ ఇన్నింగ్స్ లో సాధించాడు.