ఏపీ యువతికి గోల్డ్ మెడల్
తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్-2025లో తెలుగు తేజం జ్యోతి యర్రాజీ మరోసారి అదరగొట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్కి చెందిన ఆమె గోల్డ్ మెడల్ సాధించారు. 100 మీటర్ల హార్డిల్స్ ఫైనల్స్ లో సత్తా చాటారు. కేవలం 12.99 సెకన్లలో 100 మీటర్ల హార్డిల్స్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. ఈ ఫైనల్ పోరు అత్యంత రసవత్తరంగా సాగింది. చివరి రెండు హార్డిల్స్ వరకు జ్యోతి వెనుకంజలోనే ఉంది. కానీ రెప్పపాటులో అందరినీ దాటుకుంటూ ముందుకు వచ్చింది.