IPL 2025: ఫైనల్ కు వెళ్లేది ఎవరో..?
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ ఉత్కంఠ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైయర్ 1లో విజయం సాధించి నేరుగా ఫైనల్ కు చేరుకోగా, గుజరాత్ టైటాన్స్ పై ఎలిమినేటర్ లో గెలిచిన MI క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ ను ఢీకొననుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ రోజు రాత్రి 07:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్లో RCBతో ఢీకొంటుంది. మరి వీరిలో ఎవరు ఫైనల్ లోకి వెళ్తారో వేచి చూడాల్సిందే.