భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం

Sports Published On : Friday, June 13, 2025 11:00 AM

ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ మరో పతకాన్ని సాధించింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో సిఫ్ట్ కౌర్ సమ్రా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ కు చెందిన ఎలవెనిల్ వలరివన్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా సిఫ్ట్ కౌర్ కూడా అసాధారణ ఆటతో పతకాన్ని సొంతం చేసుకుంది.