వైసీపీ మద్దతు ఎవరికో...

Politics Published On : Tuesday, December 4, 2018 11:25 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి గానీ, వ్యక్తికి గానీ తమ పార్టీ మద్దతు ఇవ్వడం​ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ  పోటీ చేయరాదని నిర్ణయించుకున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు తమ ఆత్మసాక్షి మేరకు  ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపేలా వ్యవహరించిన వైసీపీ తెలంగాణ జనరల్‌ సెక్రెటరీ కె. శివకుమార్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు అధిష్టానం వెల్లడించింది. పార్టీ లెటర్‌ హెడ్‌ ఉపయోగించి కె. శివకుమార్‌ మంగళవారం ఇచ్చిన ప్రకటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం అత్యవసరంగా భేటి అయి శివకుమార్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కస్తున్నట్లు ప్రకటించింది.