జగన్ కు నష్టం కలిగించేలా వైసీపీలోని ఓ కోటరీ చేస్తోంది: విజయసాయిరెడ్డి
వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను తెలుగుదేశం పార్టీకి గానీ, చంద్రబాబుకు గానీ అమ్ముడుపోలేదని, తనపై కావాలనే కొందరు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీలోని ఓ కోటరీయే తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని, తనను రెచ్చగొట్టి, పార్టీకి, జగన్ కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తోందని X వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు.