చంద్రబాబుకు ఏం జరిగిందని ఎల్లో మీడియా శోకాలు..

Politics Published On : Saturday, June 15, 2019 12:09 PM

టీడీపీతో పాటు ఎల్లో మీడియాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో తీరని అవమానం జరిగినట్లు, బాబు కాన్వాయ్‌కి ట్రాఫిక్‌ ఆపి బాబుకు క్లియరెన్స్ ఇవ్వటలేదు అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ‘ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ గారిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు గురించి అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది అని మండిపడ్డారు. బాబు కాన్వాయ్‌కి ట్రాఫిక్‌ను ఆపడం లేదట. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట. ఒక బీసీ నాయకుడు స్పీకర్ అయితే గౌరవించాల్సిన అవసరం లేదనే మీ ఫిలాసఫీ అందరికీ తెల్సిందే చంద్రబాబూ గారూ. కిందటిసారి మీ కులపెద్ద సభాపతి అయితే తోడుగా వెళ్లారు. అప్పుడు మీరు పిలవకున్నా హుందాగా జగన్‌గారు మీతో పాటు నడిచి సభాపతిని అభినందించారు. మీకూ జగన్కు తేడా అదే!

కాగా చంద్రబాబు నాయుడును నిన‍్న గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి అవమానించారంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆయనకు విమానాశ్రయంలో ప్రత్యేక వీఐపీ వాహనం కేటాయించకుండా అందరూ వెళ్లే బస్సులోనే పంపించడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.