కేజ్రీవాల్ గెలుపు వెనుకగల ముఖ్య కారణాలు.
ఒక సామాజిక వేత్త, అత్యున్నత విశ్వ విద్యాలయంలో ఇంజనీరింగ్ చదివిన వ్యక్తిని పట్టుకుని బీజేపీ వాళ్లు టెర్రరిస్ట్ అన్నప్పుడే ఆయన గెలుపుకు దారి ఏర్పడింది. పాకిస్తాన్ వాళ్ళు దేశ రాజకీయాల్లో తలదూర్చినప్పుడు నీవు మూసుకో, మోడీ మా దేశ ప్రధాని అని వారికి కౌంటర్ వేసినప్పుడే విజయానికి ఆమడ దూరంలో నిలిచారు.
దేశ రాజధానిలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఘటనలన్నింటికీ ఆప్ ప్రభుత్వమే కారణమన్న స్థాయిలో మోడీ షాలు చేసిన ప్రచారం ఆప్ విజయానికి ఓ కారణం. ఓటింగ్ కు రెండు రోజుల ముందు ఉమెన్స్ కాలేజీలో పంక్షన్ జరుగుతున్న సమయంలో లోపలకి జొరబడిన కామాంధులు వారిని తాకరాని చోట తాకినప్పుడు,దానిని బయటకు రాకుండా చేసిన ప్రయత్నాలు ఢిల్లీ ఓటర్లకు తెలియనవి కావు. ఇలాంటివి చాలా కేజ్రీవాల్ విజయానికి దోహద పడ్డాయి.