బ్రేకింగ్: వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మేడా

Politics Published On : Thursday, January 31, 2019 01:26 PM

వైఎస్సార్ కడప జిల్లా రాజం పేట నియోజకవర్గ అధికార టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మేడ తన అనుచరులతో భారీ సంఖ్యలో హైదరాబాదులోని వైఎస్ జగన్ నివాసమైన లోటస్‌పాండుకు చేరుకుని కార్యకర్తలు, అనుచరుల సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైసీపీ కండుపా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మేడా మల్లికార్జున సోదరులు రఘునాథ్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డిలతో పాటు సుమారుగా 4,000 మంది అనుచరులు లోటస్‌పాండుకు తరలి రావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లా నుండి కేవలం రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలుపొందింది. టీడీపీ పార్టీలోని ఆధిపత్య పోరు కారణంగా వైసీపీ గూటికి చేరారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు ఎమ్మెల్యే పదవికి ఇది వరకే రాజీనామా చేసినట్లు మేడా మల్లికార్జున ప్రకటించారు.