జగన్, భారతి క్షమాపణ చెప్పాలి: షర్మిల
అమరావతి మహిళలకు సాక్షి టీవీ ఛైర్మన్ భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. జగన్ కూడా క్షమాపణ కోరితే సంతోషిస్తానన్నారు. చిత్తూరులో షర్మిల మీడియాతో మాట్లాడారు. అమరావతి మహిళను కించపరిచేలా సాక్షిలో చర్చలు జరగడం దారుణమన్నారు. సాక్షి పత్రిక, ఛానల్ ప్రజాసమస్యలను విస్మరించి వైసీపీకి ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.