మూడు రాజధానులపై ప్రధాని లేఖ: టీడీపీ వాదనలపై స్పందన: మోడీ ఏం తేల్చారు,!
ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా,లేక సమాచారం ఇవ్వకుండానే డిసైడ్ అయ్యారా అనే దాని పైన చర్చ సాగింది. ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యులు సైతం దీని పైన భిన్నంగా స్పందించారు. ఇక, ఇదే సమయంలో టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ అమరావతి వ్యవహారంలో జరుగుతున్న నిర్ణయాల గురించి ప్రధానికి లేఖ రాశారు. పరిపాలనా వికేంద్రీకరణ ముసుగులో మూడు రాజధానులుగా వర్గీకరించి, మూడు ప్రాంతాల్లో నెలకొల్పాలని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కనకమేడల ప్రధానికి రాసిన లేఖలో వెల్లడించారు.దీని పైన ప్రధాని మోడీ టీడీపీ ఎంపీకీ రిప్లై ఇచ్చారు. మూడు రాజధానుల అంశం తమ దృష్టికి వచ్చినట్లు మోడీ తెలిపారు. అయితే, తాము ఆ లేఖ పైన ఏ రకంగా స్పందించేదీ మాత్రం అందులో ప్రస్తావించలేదు.