తెలుగు రాష్ట్రాల రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బుల వెల్లువ

Politics Published On : Wednesday, February 27, 2019 11:30 AM

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు చేయటం వేగవంతమైనట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం నాటికి ఈ పథకం కింద 19 లక్షల మంది రైతుల ఖాతాల వివరాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే 5.91 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కో ఖాతాకి రూ.2 వేల చొప్పున జమచేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు 118.22 కోట్లు రైతుల ఖాతాల్లో డిపాజిట్ అయినట్టు వెల్లడించారు.