టీడీపీ మహానాడుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఏటా నిర్వహించే మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇదొక చారిత్రక రాజకీయ వేడుక. నేడు కడపలో ప్రారంభమైన మహానాడుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మహానాడు... ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది 'తెలుగు దేశం' పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి' అన్నారు.