ఎవరికి ఓటు వేయాలో చెప్పిన పవన్...

Politics Published On : Wednesday, December 5, 2018 11:09 PM

తనకు తెలంగాణ అంటే ఎనలేని గౌరవమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో, సమయం తక్కువగా ఉండటం వల్ల, ఎక్కువ సమయాన్ని తాను కేటాయించలేక పోతుండటం వల్ల... ఇక్కడ జనసేన పోటీ చేయలేకపోయిందని అన్నరు. తెలంగాణను ఇచ్చామనేవాళ్లు, తెలంగాణను తెచ్చామనేవాళ్లు, తెలంగాణను దించామనేవాళ్లు ఇప్పుడు మన ముందు ఉన్నారని... వారిలో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయరాదనే అయోమయంలో అందరూ ఉన్నారని తెలిపారు. ఎక్కువ పారదర్శకత, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పాలనను అందిస్తారో... లోతుగా ఆలోచించి వారికి ఓటు వేయాలని సూచించారు.