విశాఖలో సీఎం జగన్‌కు స్పాట్ పెడుతూ, బీజేపీ సంచలన నిర్ణయం,

Politics Published On : Friday, March 13, 2020 05:05 PM

దేశ రాజకీయాల్లో ఒక అరుదైన సందర్భం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకోబోతున్నది. తండ్రీకొడుకులు, జాతీయ పార్టీ బీజేపీకి స్థానికంగా సారధ్య బాధ్యతలు నిర్వహించిన రికార్డును సొంతం చేసుకోబోతున్నారు. ఆ తండ్రి పేరు పీవీ చలపతిరావు. 1980లో జనసంఘ్ నుంచి విడిపోయి సొంతపార్టీగా ఏర్పడిన సందర్భంలో ఏపీ బీజేపీకి తొలి అధ్యక్షుడిగా పీవీ చలపతి పనిచేశారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత, ఆయన కొడుకు పీవీఎన్ మాధవ్ ఏపీ బీజేపీ సారధిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సబంధించి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.