మినీ అమరావతి గా నంద్యాల..!

Politics Published On : Sunday, January 19, 2020 12:00 PM

మీకు గుర్తువుందో లేదో కానీ మన మాజీ మంత్రి లోకేష్ నంద్యాల ఉప ఎన్నికలప్పుడు నంద్యాలను మినీ అమరావతి గా చేస్తాము అని అన్నారు. కానీ ఇప్పుడు విశాఖలో సచివాలయం , కర్నూల్ లో హై కోర్ట్ పెట్టి మూడు మినీ అమరావతి లను చేయడానికి పూనుకున్న జగన్ మోహన్ రెడ్డి ని తుక్లక్ పాలన అని విమర్శిస్తున్నారు.

అప్పుడు నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో నంద్యాలకి 1100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామని, ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు , ప్రతి గ్రామానికి సీసీ రోడ్, పేదలందరికీ పక్కా ఇళ్ళు శ్రీశైలం జలాశయం నుంచి ప్రతి గ్రామానికి తాగు మరియు సాగు నీరు ఇస్తామని చెప్పారు, మరి ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని లోకేష్ వ్యతిరేకిస్తున్నారు అంటే అప్పుఫు కేవలం ఓట్ల కోసమే ఇన్ని హామీలు ఇచ్చి వుంటారు అని అర్థం చేసుకోవచ్చు.

ఇకనైనా అమరావతి రైతులు చంద్రబాబు మరియు లోకేష్ కుట్రలు తెలుసుకొని జాగ్రత్త పడాలి అని కోరుకుంటున్నాము.