ఆయన చెప్పిన వారికే టీడీపీ సీట్లు, అందుకే ఓడిపోయాం..!

Politics Published On : Friday, June 21, 2019 11:00 AM

గత ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పివారికే టీడీపీ సీట్లు, పార్టీ ఫండ్ కోట్లు ఇచ్చారని ఆ పార్టీకి చెందిన కాపు ప్రజాప్రతినిధులు చంద్రబాబుని ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించడానికి టీడీపీ కాపు ప్రజాప్రతినిధులు గురువారం కాకినాడలో సమావేశమైన సంగతి మనకి తెలిసిందే. అయితే ఈ సమావేశం మొత్తం టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్‌ టార్గెట్‌గా సాగినట్టు తెలుస్తోంది. లోకేశ్‌ తన సొంత సామాజిక వర్గానికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని నేతలు విమర్శలు చేసారు. చంద్రబాబు, లోకేశ్‌లు కాపులను అవమానంగా చూసేవారని అన్నారు.

ఎన్నికల సమయంలో నిధులు కూడా ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా ఇచ్చారని తెలిపారు. కాపు ప్రజా ప్రతినిధులను కలవడానికి కూడా ఇష్టపడలేదని, సమయం కూడా ఇవ్వలేదన్నారు. సూటు బూటు వేసుకున్న వారికే లోకేశ్‌ ఎక్కువ సమయం కేటాయించే వారని మండిపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నేతల కంటే కమ్మ సామాజిక వర్గం వారికే పార్టీ ఫండ్‌ ఎక్కువగా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఓటమికి కారణమని అన్నారు.