శబాష్ అంటూ జగన్ ని కీర్తించిన నరేంద్ర మోడీ..!

Politics Published On : Sunday, April 5, 2020 09:36 AM

ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆర్పీ దీపాలను వెలిగించండి. కమ్ముకొస్తున్న కరోనా చీకటిని రాష్ట్ర ప్రజలు ఆశాజ్యోతిని వెలిగించడం ద్వారా ఒక అనంతమైన ప్రకాశంతో పారద్రోలుదాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కోవిడ్‌–19 మహమ్మారిపై మనమంతా ఐక్యంగా ఒక బలీయమైన చెక్కుచెదరని శక్తిగా నిలబడదాం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాత్రి ట్వీట్‌ చేశారు. 

ఆ ట్వీటుకు మోడీ జగన్ మోహన్ రెడ్డి పైన ప్రశంసల జల్లు కురిపించారు జగన్‌గారూ ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో మీ సహకారం ఎంతో విలువైనది. కరోనాపై పోరాటంలో దేశ ప్రజల్లో సమైక్యత పెంపొందించడానికి అది ఎంతగానో దోహదపడుతుంది అని ట్వీట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.