చిరంజీవికి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్..!

Politics Published On : Sunday, January 19, 2020 10:58 AM

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు ఎన్నిక కానున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాలలోకి వెలితే చిరంజీవి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం అయన తన సినిమాలతో బిజీగా వున్నారు, అయితే ఇటువంటి సమయంలోనే చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం పెను సంచలనంగా మారింది. కలవటమే కాకుండా జగన్ బాగా పాలన చేస్తున్నారు అని ప్రశంసలు ఇచ్చారు.

తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒకపక్క జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే, చిరంజీవి మాత్రం ఇలా జగన్ ని కలిసి ప్రశంసలు కురిపించటం పవన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజధాని విషయంలో కూడా చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు, అధికార వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవుతాయి అని చిరంజీవి అన్నారు. ఇలా తన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న చిరంజీవికి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈసారి వైసీపీ పార్టీకి 5 నుండి 6 రాజ్యసభ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. వీటిలో ఒక సీట్ చిరంజీవికి ఇవ్వాలి అని జగన్ అనుకుంటున్నారు అని సమాచారం. ఇదే విషయాన్నీ జగన్ చిరంజీవికి చెప్పగా అయన సున్నితంగా తిరస్కరించారు అని సమాచారం, తానూ రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను అని నాకు పదవులు వద్దు అని చిరంజీవి అన్నారు.