ప్రవాస ఆంధ్రులకి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన జగన్ ..!

Politics Published On : Sunday, August 18, 2019 11:52 AM

పారిశ్రామిక అభివృద్ధికి రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నాం రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రండి. మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం మీకు అండగా మేముంటాం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నామని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆగస్టు 17 సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు.