ఆచరణలోకి రాకముందే బురద చల్లడం కరెక్టేనా..!

Politics Published On : Wednesday, June 12, 2019 10:00 AM

ప్రతి పేద విద్యార్థికి చదువు అందాలనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం ప్రవేశపెడతామని ఏపీ సీఎం జగన్ తన నవరత్నాలలో చెప్పారు. ఇందులో భాగంగా సంవత్సరానికి రూ 15 వేలు అమ్మ బ్యాంకు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది ఏ పాఠశాలకు వర్తిస్తుందనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోకుండా దానిపై నెగిటివ్గా సోషల్ మీడియాలో స్పందించడం కరెక్టేనా, అయినా వచ్చే ఏడాది జనవరి 26న అమల్లోకి వచ్చే ఈ పథకం మీద మార్పులు చేర్పులు ఉండవంటారా. ఈ లోపే దానిపై టీడీపీ వాళ్లు బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్, కొంచెం ఆలోచన చేస్తే మంచిది