ఢిల్లీ అల్లర్లపై తొలిసారిగా పెదవి విప్పిన నరేంద్ర మోడీ
దేశ రాజధానిని అట్టుడికిస్తోన్న అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెదవి విప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరిస్తోన్న ఆందోళనకారులపై రెండురోజులుగా దాడులు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై నరేంద్ర మోడీ స్పందించడం ఇదే తొలిసారి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ముగిసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నరేంద్ర మోడీ ఈ అల్లర్లపై స్పందించారు, ట్విట్టర్ ద్వారా. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి సహకరించాలని ఆయన ఢిల్లీవాసులకు విజ్ఙప్తి చేశారు.