24ఏళ్ల కృషి ఫలించింది సీఎం సీటు వరించింది...!

Politics Published On : Tuesday, May 28, 2019 11:00 AM

సిక్కిం మన దేశంలో ఒక చిన్న రాష్ట్రం, అక్కడ 24 సంవత్సరాల తరువాత కొత్త ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది. సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) అధ్యక్షుడు, పీఎస్‌ గోలె పేరుతో ప్రజలకు సుపరిచితులైన ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌(51) సోమవారం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పల్జోర్‌ మైదానంలో గోలెతో పాటు మరో 11 మంది శాసనసభ్యులచేత కూడా గవర్నర్‌ గంగా ప్రసాద్‌ ప్రమాణం చేయించారు. గోలె ప్రస్తుత శాసనసభలో సభ్యుడు కారు. ఈ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేదు. అయినప్పటికీ శనివారం శాసనసభా నేతగా ఎన్నికయ్యారు. 2013లో ఎస్‌కేఎం పార్టీని స్థాపించారు. 32 స్థానాలున్న సిక్కిం అసెంబ్లీలో 17 స్థానాలు గెలవడం ద్వారా 24 ఏళ్ల తరువాత చామ్లింగ్‌ ప్రభుత్వాన్ని మార్చగలిగింది. ఎస్‌డీఎఫ్‌ 15 సీట్లు సాధించింది.